వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-02-25T05:02:32+05:30 IST

నందమూరుగరువు వీరవాసరం పశ్చిమకాలువ వద్ద ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు.

వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

వీరవాసరం, ఫిబ్రవరి 24: నందమూరుగరువు వీరవాసరం పశ్చిమకాలువ వద్ద ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. వేదపండితులు పవన్‌కుమార్‌ బృందం స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు కల్యాణం సందర్భంగా నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమాలను రద్దు చేశారు. ఆలయ నిర్వాహకులు కొటికలపూడి చిన్ని, మద్దాల మురళీ జగన్నాధం, అర్చకులు శ్రీనివాసుల నర్సింహాచార్యులు కల్యాణ వేడుకలను పర్యవేక్షించారు.

Updated Date - 2021-02-25T05:02:32+05:30 IST