అందరికీ అందుబాటులో ఉంటా : శివ
ABN , First Publish Date - 2021-10-17T05:16:10+05:30 IST
ఇక నుంచి నియోజ కవర్గ ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు.
కాళ్ళ/ ఉండి/పాలకోడేరు/ఆకివీడు, అక్టోబరు 16 : ఇక నుంచి నియోజ కవర్గ ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. సుమారు రెండున్నరేళ్ల తరువాత నియోజకవర్గానికి విచ్చేసిన ఆయనకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాళ్ళకూరులో ఎమ్మెల్యే రామరాజుతో కలిసి వేంకటేశ్వ రస్వామిని దర్శించుకుని కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నియోజక వర్గం తన కుటుంబం లాంటి దని, ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్క రించడానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఉండి మండ లం వెలివర్రులో శ్రీవీరపేరంటాలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకివీడు పెద్దింట్లమ్మ దేవస్థానం ఈవో రంగరాజు, నిర్వాహకుడు బొమ్మారెడ్డి మాధవరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. శుక్రవారం రాత్రి ఆయన పెద్దింట్లమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఉండి నియో జకవర్గంలోని ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల నాయకులు ఆయనను కలిశారు.ఆయా మండలాల్లో ఘన స్వాగతం పలికారు.