పేదలకు ఇళ్లు ఇచ్చేది ఎప్పుడు?
ABN , First Publish Date - 2021-08-24T00:58:23+05:30 IST
రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు ఇచ్చేది ఎప్పుడని సీఎం జగన్ను టీడీపీ సీనియర్ నేత, మాజీ
విశాఖ: రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు ఇచ్చేది ఎప్పుడని సీఎం జగన్ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. పేదల ఇంటి విషయంలో ప్రజలను జగన్ సర్కారు మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. శ్రావణమాసంలో పేదలకు టిడ్కో ఇల్లు ఇస్తామని అన్నారని, అది ఏమైందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అంటున్నారు, ఆ ఆస్తులను అమ్మేదిఎప్పుడు, పేదలకు ఇళ్లు ఇచ్చేది ఎప్పుడని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జగన్ అబద్ధాల కోరని, జగన్వి సన్నాసి కబుర్లు అని, రివర్స్ సీఎం అని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల నిధులు దారి మళ్లిస్తున్నా మంత్రి బొత్స ఎందుకు మాట్లాడరని బండారు సత్యనారాయణ మూర్తి నిలదీశారు.