మార్పు మొదలైంది... గన్ని
ABN , First Publish Date - 2021-10-26T04:16:38+05:30 IST
మార్పు మొదలైందని... ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నదని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు.
ఉంగుటూరు, అక్టోబరు 25: మార్పు మొదలైందని... ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నదని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. నారాయణపురంలో టీడీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురువెల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు సోమవారం సర్పంచ్ దిడ్ల అలకనంద దేవి, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలో సుమారు 50 మంది టీడీపీలో చేరారు. స్థానిక నాయకత్వ తీరును పలువురు తప్పు బట్టారు. కార్యక్రమంలో మండల పార్టీ అఽధ్యక్షుడు పాతూరి విజయకుమార్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా ఆనంద్, మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎడ్ల శివ ప్రసాద్, మాజీ ఎంపీపీ గోలి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.