భీమడోలులో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజేయులు నిరసన దీక్ష
ABN , First Publish Date - 2021-06-29T22:23:32+05:30 IST
భీమడోలులో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజేయులు నిరసన దీక్ష
ఏలూరు: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న సాధన దీక్షకు మద్దతుగా ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు భీమడోలు క్యాంపు కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కోవిడ్తో మరణించిన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయిన బాధితులకు రూ.25 లక్షల నష్ట పరిహారం అందించాలన్నారు. కోవిడ్ కారణంగా పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కరువైందన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరువ్యాపారులు, వృత్తిదారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలని గన్ని వీరాంజనేయులు