నాణ్యమైన పొగాకు పండించాలి

ABN , First Publish Date - 2021-12-31T05:14:49+05:30 IST

ఉత్తమ యాజమాన్య పద్ధతులను అవలంబించి ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకులో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రసాయన అవశేషాలు లేని పొగాకు పండించాలని జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్ర నిర్వహణాధికారి బి.శ్రీహరి అన్నారు.

నాణ్యమైన పొగాకు పండించాలి
రైతులకు సూచనలు ఇస్తున్న పొగాకు వేలం కేంద్రం అధికారి

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 30: ఉత్తమ యాజమాన్య పద్ధతులను అవలంబించి ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకులో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రసాయన అవశేషాలు లేని పొగాకు పండించాలని జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్ర నిర్వహణాధికారి బి.శ్రీహరి అన్నారు. జంగారెడ్డిగూ డెం–1 వేలం కేంద్రంలో గురువారం రైతులతో సమావేశం అయ్యారు. ఎగు మతి యోగ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలన్నారు. పొగాకులో నిషిద్ధ మందులు వాడితే నోటీసులు ఇస్తామన్నారు. పల్లపు ప్రాంతం, మాగాణి ప్రాంతంలో పొగాకు వేయరాదన్నారు. పరిమి రాంబాబు, అల్లూరి రామకృష్ణ, గద్దే బాబు రాజేంద్రప్రసాద్‌, ఎస్‌జీవో కె.సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:14:49+05:30 IST