లాటరీ మెసేజ్లు నమ్మి మోసపోవద్దు : ఎస్పీ రాహుల్
ABN , First Publish Date - 2021-10-26T05:19:01+05:30 IST
ఏటీఎం కేంద్రాల వద్ద లావాదేవీలు చేసే సమయంలో ఎవరైనా సహాయం చేస్తామని అపరిచితులు వస్తే అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ సూచించారు.

ఏలూరు క్రైం, అక్టోబరు 25 : ఏటీఎం కేంద్రాల వద్ద లావాదేవీలు చేసే సమయంలో ఎవరైనా సహాయం చేస్తామని అపరిచితులు వస్తే అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఫిర్యాదులు స్వీకరించారు. లాటరీల పేరుతో వచ్చే మెస్సేజ్లు నమ్మి మోసపోవద్దని తెలియని మెసేజ్ల లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ తన భర్త వేధింపులకు గురి చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. తన భూమిని పక్క ఆసామి ఆక్రమించుకుని అసత్య ఆరోపణలతో కేసులు పెడుతున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని టి.నర్సాపురం మండలం నుంచి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను శాఖాపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.