శింగవరంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
ABN , First Publish Date - 2021-04-11T05:10:01+05:30 IST
క్రీడల ద్వారా మానసిక సామర్థ్యంతో పాటు క్రీడా స్ఫూర్తి పెంపొందు తుందని సొసైటీ అధ్యక్షుడు పెన్మె త్స చందు అన్నారు.
నిడదవోలు, ఏప్రిల్ 10 : క్రీడల ద్వారా మానసిక సామర్థ్యంతో పాటు క్రీడా స్ఫూర్తి పెంపొందు తుందని సొసైటీ అధ్యక్షుడు పెన్మె త్స చందు అన్నారు. శింగవరంలో దళిత వర్గాల ఫెడరేషన్ ఆధ్వర్యం లో జిల్లాస్థాయి వాలీబాల్ టోర్న మెంటును శనివారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయటని మొదటి బహుమతిగా రూ.25 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. మెజిస్ట్రేట్ చావల రమ్య మాట్లాడు తూ అంబేడ్కర్, బాబూజగ్జీవ న్రామ్, జ్యోతీరావుపూలే వంటి మహనీయులు జయంతి పురస్కరించుకుని పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చెట్టే రాజు, చావల రాజ్ భరత్, సరిపల్లి రమణ, పంతకాని సురేశ్, సారథి, దిద్దే దయామణి, దళితప్రశ్న సతీశ్ పాల్గొన్నారు.