మా బడి..మాక్కావాలి..
ABN , First Publish Date - 2021-10-30T04:52:23+05:30 IST
మా పాఠశాలలోనే చదువుకుంటాం.. మూయవద్దంటూ.. భీమవరంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు రెండో రోజు రోడ్డెక్కారు..
భీమవరంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం ఎయిడెడ్ పాఠశాల విద్యార్థుల ఆందోళన
భీమవరం ఎడ్యుకేషన్, అక్టోబరు 29 : మా పాఠశాలలోనే చదువుకుంటాం.. మూయవద్దంటూ.. భీమవరంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు రెండో రోజు రోడ్డెక్కారు.. చదువుకునే సమయంలో పాఠశాల కోసం విద్యార్థుల పోరాటం.. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు శుక్రవారం పాఠశాల నుంచి ప్రధాని రహదారి మీదుగా మాస్కూల్ మాకు కావాలి అంటూ నినాదాలతో సాగారు. ఎస్ ఎఫ్ఐ నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్కు వినతిపత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చూస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని చెప్పా రు.ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కె.సూర్య మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల ప్రైవేటీకరణ తగదన్నారు.కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.