సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ‘శశి’ హవా
ABN , First Publish Date - 2021-07-24T05:45:36+05:30 IST
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శశి–వేలివెన్ను విద్యార్థులు ప్రతిభ చూపినట్టు శశి విద్యా సంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు.

ఉండ్రాజవరం, జూలై 23: సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శశి–వేలివెన్ను విద్యార్థులు ప్రతిభ చూపినట్టు శశి విద్యా సంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 991 మార్కులను ముగ్గురు, 990 మార్కులను ఐదుగురు విద్యార్థులు సాధించారని, బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 991 మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించినట్టు తెలిపారు. విద్యార్థులను వైస్ ఛైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ అభినందించారు.