స్రవంతి మృతిపై అనుమానాలు ఆరోపణలే : ఆర్డీవో
ABN , First Publish Date - 2021-11-06T05:01:14+05:30 IST
మార్టేరు ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో చదువు తున్న విద్యార్థిని గెడ్డం స్రవంతి మృతిపై ఎవరూ ఎటువంటి ఆధారాలు చూపించ లేదని, కేవలం అనుమానాలు ఆరోపణలు చేశారని ఆర్డీవో ఎస్.మల్లిబాబు తెలిపా రు.

పెనుమంట్ర, నవంబరు 5 :మార్టేరు ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో చదువు తున్న విద్యార్థిని గెడ్డం స్రవంతి మృతిపై ఎవరూ ఎటువంటి ఆధారాలు చూపించ లేదని, కేవలం అనుమానాలు ఆరోపణలు చేశారని ఆర్డీవో ఎస్.మల్లిబాబు తెలిపా రు. గతనెల 28న స్రవంతి అనుమానాస్పదంగా మృతి చెందడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ ముందు ఎవరూ ఆధారాలు చూపించలేకపోయారని, విచారణలో పాఠశాల విద్యార్థినులు, తోటి హాస్టల్ విద్యార్థినులు, తొలిసారి చూసిన వారిని విచారణ చేశామన్నారు. ఈ ఘటనకు సంబంధించి తుది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తమ విచారణలో తెలుసుకున్న అంశాలు, పోస్టుమార్టం అంశాల ను జోడించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. విచారణలో తహసీల్దార్ వైదుర్గాకిషోర్, పెనుగొండ సీఐ వీవీవీ నాగేశ్వరరావు, పెనుమంట్ర ఎస్ఐ ఎస్ఎస్వీవీ రమేష్ పాల్గొన్నారు.