హతమైన కొండచిలువ
ABN , First Publish Date - 2021-11-06T04:59:12+05:30 IST
గ్రామస్థుల చేతిలో ఏడడుగుల కొండచిలువ హతమైంది.

టి.నర్సాపురం, నవంబరు 5: గ్రామస్థుల చేతిలో ఏడడుగుల కొండచిలువ హతమైంది. మండలంలోని పుట్రేపు గ్రామానికి చెందిన గుండే సూర్యారావు పొలం లో కోళ్లు పెంచుతున్నాడు. గురువారం అర్ధరాత్రి కోళ్లు బెదరడంతో తన కుమారు డు పరిశీలించగా కొండచిలువ కోళ్లను మింగేందుకు ప్రయత్నింస్తుంది. దీంతో కొందరు గ్రామస్థులతో కలిసి కొండచిలువను హతమార్చారు. కొండచిలువ 7 అడుగుల పొడవు ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.