త్వరితగతిన సమస్యల పరిష్కారం : డీఐజీ

ABN , First Publish Date - 2021-10-30T05:26:03+05:30 IST

సమస్యలపై అందిన వినతులను శాఖాపరంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరిస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన రావు చెప్పారు.

త్వరితగతిన సమస్యల పరిష్కారం : డీఐజీ

ఏలూరు క్రైం, అక్టోబరు 29 : సమస్యలపై అందిన వినతులను శాఖాపరంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరిస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన రావు చెప్పారు. శుక్రవారం ఏలూరులోని తన కార్యాలయంలో  నిర్వహించిన సంక్షేమ దివస్‌ కార్యక్రమంలో ఏలూరు రేంజ్‌ పరిధిలోని రాజమహేంద్ర వరం అర్బన్‌,  పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో పని చేస్తున్న పోలీస్‌ సిబ్బంది, మహిళా పోలీస్‌, మినిస్టీరియల్‌ సిబ్బంది పలువురు తమ సమస్యలపై వినతులను అందించారు. ఎక్కువగా ప్రమోషన్లు, పనిష్మెంట్లు, సర్వీసు రూల్స్‌ వంటి అంశాలపై వినతులు రాగా వీటిని స్వయంగా డీఐజీ పరిశీలించారు. కొంతమంది రాలేనివారు నేరుగా డీఐజీకి ఫోన్‌ చేసి తమ సమస్యను తెలిపారు.

Updated Date - 2021-10-30T05:26:03+05:30 IST