విద్యార్థులు, ఉపాధ్యాయుల ర్యాలీ

ABN , First Publish Date - 2021-10-30T05:14:17+05:30 IST

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేవరపల్లి మూడు రోడ్ల సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, ఆటో డ్రైవర్లు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల ర్యాలీ
దేవరపల్లి బస్టాండ్‌ వద్ద మానవహారం

దేవరపల్లి, అక్టోబరు 29: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేవరపల్లి మూడు రోడ్ల సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆటో డ్రైవర్లు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమర వీరులు అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. బస్టాండ్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ఎస్‌ఐలు కె.శ్రీహరిరావు, ఎన్‌.హరి బాబు, ఏఎస్‌ఐ జోసఫ్‌, రైటర్‌ రమణారావు, దేవరపల్లి బీహెచ్‌ఎస్‌ఆర్‌ వీఎల్‌ఎం డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, ఉపాధ్యాయు లు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:14:17+05:30 IST