రైల్వే ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర తగ్గింపు
ABN , First Publish Date - 2021-09-29T06:31:54+05:30 IST
రైల్వేస్టేషన్లలోని ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను బుధవారం అర్ధరాత్రి నుంచి రూ.20 నుంచి పదికి తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీచేసింది.
నరసాపురం, సెప్టెంబరు 28 : రైల్వేస్టేషన్లలోని ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను బుధవారం అర్ధరాత్రి నుంచి రూ.20 నుంచి పదికి తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీచేసింది. గత ఏడాది కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్లాట్ ఫామ్లపై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు టిక్కెట్ ధరలను పెంచింది. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడుతుండడం, చాలా రైళ్లు మళ్లీ పట్టాలు ఎక్కుతుండడంతో ఈ టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయించింది. జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, కొవ్వూరు, నరసాపురం స్టేషన్లలో ఇవి అమల్లోకి వస్తాయి.