శ్రీ క్షీరా రామలింగేశ్వరుడి కల్యాణానికి అంకురార్పణ
ABN , First Publish Date - 2021-04-22T05:42:31+05:30 IST
పంచారామ క్షేత్రం లోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామితో పార్వతీదేవికి, క్షేత్రపాలకుడైన శ్రీ జనార్దన స్వా మితో శ్రీలక్ష్మీ దేవి కి కల్యాణోత్సవం బుధవారం ప్రారంభమైంది.
పాలకొల్లు అర్బన్, ఏప్రిల్ 21 : పంచారామ క్షేత్రం లోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామితో పార్వతీదేవికి, క్షేత్రపాలకుడైన శ్రీ జనార్దన స్వా మితో శ్రీలక్ష్మీ దేవి కి కల్యాణోత్సవం బుధవారం ప్రారంభమైంది. కల్యాణ వేడుకల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, బలిహరణ వంటి ఆగమ సూత్రానుసారం అర్చకులు, వేద పండితులు కిష్టప్ప, పూర్ణయ్య, అనీల్ శర్మ, నిర్వహించారు. ఈ వేడుకలను భక్తులు వీక్షించారు. కార్యక్రమంలో ఈవో యాళ్ళ సూర్యనారాయణ, పాలక మండలి చైర్మన్ కోరాడ శ్రీనివాస్, ట్రస్టీలు పాల్గొన్నారు.