ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో మార్పులు
ABN , First Publish Date - 2021-03-06T06:20:51+05:30 IST
ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జంగారెడ్డిగూ డెం, కుక్కునూరు డివిజన్లలోని పోలింగ్ సమయాల్లో మార్పులు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఏలూరు సిటీ, మార్చి 5 : ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జంగారెడ్డిగూ డెం, కుక్కునూరు డివిజన్లలోని పోలింగ్ సమయాల్లో మార్పులు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. బ్యాలెట్ పేపర్లు ఎట్టి పరిస్థితుల లోను బయటకుపోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముద్రణ పూర్తయిన బ్యాలెట్ పత్రాలను వెల్ఫేర్ జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్భరత్తో కలిసి ఆయన పరిశీలించారు. పోటీలోవున్న అభ్యర్థుల పేర్లు, కేటాయించిన గుర్తులు సక్రమంగా ఉన్నది లేనిదీ పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కలెక్టరేట్ ఏవో ఎం.సూర్యనారాయణ కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.