మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతాం : మంత్రి
ABN , First Publish Date - 2021-07-25T05:03:41+05:30 IST
గృహ నిర్మాణాలను త్వరితిగతంగా పూర్తిచేసి మోడల్ కాలనీలుగా తర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు.

ఉండి, జూలై 24 : గృహ నిర్మాణాలను త్వరితిగతంగా పూర్తిచేసి మోడల్ కాలనీలుగా తర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు. యండగండిలోని ముత్యాలమ్మ లేఅవుట్, ఎస్సీ కాలనీలో లేఅవుట్ను శనివారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీ లించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇబ్బందులేమైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 12 వేల కోట్ల ఖర్చుతో 33 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మౌలిక వసతులను కల్పించి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయన వెంట సర్పంచ్ గోగుల మండ చిన్న కృష్ణమూర్తి, తహసీల్దార్ కృష్ణజ్యోతి, విఆర్వోలు జయబాబు, బాల కృష్ణ, హౌసింగ్, పంచాయితీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు.