నేటి నుంచి మావుళ్లమ్మ నిజరూప దర్శనం
ABN , First Publish Date - 2021-12-29T05:25:40+05:30 IST
మావుళ్లమ్మ నిజరూప దర్శనం బుధవారం మధ్యాహ్నం నుంచి భక్తులకు కల్పించను న్నారు.
![నేటి నుంచి మావుళ్లమ్మ నిజరూప దర్శనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భీమవరం టౌన్, డిసెంబరు 28 : మావుళ్లమ్మ నిజరూప దర్శనం బుధవారం మధ్యాహ్నం నుంచి భక్తులకు కల్పించను న్నారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి జరిగే ఆలయ వార్షిక మహోత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహానికి రంగులు వేసే నిమిత్తం ఈ నెల 15 నుంచి నిజరూప దర్శనాన్ని నిలిపివేశారు. రంగుల పని పూర్తి కావడంతో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు.