జనసేనను బలోపేతం చేస్తాం

ABN , First Publish Date - 2021-07-25T05:20:50+05:30 IST

జిల్లాలో జనసేన పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు గోవిందరావు తెలి పారు.

జనసేనను బలోపేతం చేస్తాం
మాట్లాడుతున్న జనసేన అధ్యక్షుడు గోవిందరావు

  తాడేపల్లిగూడెం, జూలై 24 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో జనసేన పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు గోవిందరావు తెలి పారు. తాడేపల్లిగూడెంలో  శనివారం జిల్లా లోని 15 నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ సీనియర్‌ నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలో ని అందరి సూచనలు, సలహాలు తీసుకుని జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా గోవింద రావు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. తొలుత నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి న గోవిందరావును జనసేన ఇన్‌చార్జి బొలి శెట్టి, నాయకులు సత్కరించారు. సమా వేశంలో  జనసేన సీనియర్‌ నాయకులు కనకరాజు సూరి, ఇర్రింకి సూర్యారావు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు జి.వెంకలక్ష్మి, సీహెచ్‌ సూర్యప్రకాశ్‌, ప్రియ సౌజన్య, కె.శ్రీనివాస్‌, రెడ్డి అప్పలనాయుడు, రామచంద్రరావు, మేకా ఈశ్వరయ్య పాల్గొన్నారు.  


Updated Date - 2021-07-25T05:20:50+05:30 IST