వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2021-05-23T04:46:50+05:30 IST
గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధానార్చకుడు నల్లూరి రవికుమార్ ఆచార్యులు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం, మే 22: గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధానార్చకుడు నల్లూరి రవికుమార్ ఆచార్యులు నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆలయం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసినట్లు ఆలయ చైర్మన్ ఉప్పల గంగాధరం, ఈవో ఎంఎస్ఎస్.సంగమేశ్వర శర్మ తెలిపారు.
దేవస్థానానికి ఇ–హుండీ విధానం అందుబాటులోకి వచ్చినట్టు ఆలయ చైర్మన్ ఉప్పల గంగాధరం, ఈవో సంగమేశ్వరశర్మ తెలిపారు. నగదు విరాళం ఇచ్చేవారు దేవాదాయ శాఖ వెబ్సైట్ ద్వారా ఆలయం పేరు ఎంచుకుని తద్వారా అందించవచ్చన్నారు.