రాజీవ్ గాంధీకి ఘన నివాళి
ABN , First Publish Date - 2021-05-22T05:21:13+05:30 IST
నిబద్ధత తో పనిచేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు యడ్ల శివాజీ అన్నా రు.

పాలకొల్లు అర్బన్, మే 21 : నిబద్ధత తో పనిచేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు యడ్ల శివాజీ అన్నా రు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ వర్థంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించా రు. అ నంతరం గాంధీ బొమ్మల సెంటర్ లోనూ, గజలక్ష్మి సెంటర్లో వున్న రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా దేశాన్ని అభ్యుదయ పథంలో నడిపారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ మదీనా బాషా, వర్ధనపు కాసు, ఆర్.బెన్నీపాల్ పాల్గొన్నారు.