ఈ–శ్రమ్ పోర్టల్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-09-03T06:13:36+05:30 IST
అసంఘటిత రంగ కార్మికుల కోసం వారికి సామా జిక భద్రత కల్పించే ఉద్ధేశ్యంతో ఈ –శ్రమ్ పోర్టల్ను ఇటీవల ప్రారంభించినట్లు ఏలూరు జోన్–2 సంయుక్త కార్మిక కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఏలూరుసిటీ, సెప్టెంబరు 2: అసంఘటిత రంగ కార్మికుల కోసం వారికి సామా జిక భద్రత కల్పించే ఉద్ధేశ్యంతో ఈ –శ్రమ్ పోర్టల్ను ఇటీవల ప్రారంభించినట్లు ఏలూరు జోన్–2 సంయుక్త కార్మిక కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డు నకలు, బ్యాంక్ ఖాతా, సెల్ నెంబరు వివరాలతో కార్మికులు తమ వివరాలను సీఎస్సీ సెంటర్లు, పోస్టాఫీసుల్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు నన్నారు. ఈ పథకంలో చేరేందుకు 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న వారు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు అర్హులని తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు కార్మికులు తమ మొబైల్లోని ఉమంగ్/ గూగుల్/ ప్లే స్టోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ పథకంలో నమోదైన కార్మికులకు గుర్తింపు కార్డు ఇస్తారని, వారు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకానికి కూడా అర్హులు.