ఆహా.. సీతాఫలాలు
ABN , First Publish Date - 2021-10-28T04:53:19+05:30 IST
ప్రతీ ఏటా వర్షాకాలంలో పుష్కలంగా లభించే సీతాఫలాలు గణపవరం మార్కెట్లో ముంచెత్తుతున్నాయి. అమ్మకాలు జోరందుకున్నాయి.
మార్కెట్లో అమ్మకాల జోరు
గణపవరం, అక్టోబరు 27: ప్రతీ ఏటా వర్షాకాలంలో పుష్కలంగా లభించే సీతాఫలాలు గణపవరం మార్కెట్లో ముంచెత్తుతున్నాయి. అమ్మకాలు జోరందుకున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు నోరూరుతుం దనడంలో అతిశయోక్తి కాదు. పండులో తియ్యదనంతో పాటు పోషకాలు విరివిగా ఉండడంతో సీజన్లో అందరూ సీతాఫలాలు భుజించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది మంచి దిగుబడి రావడంతో మార్కెట్లో విరివిగా దిగుమతి అవుతున్నాయి. పరక కాయలు (13 కాయలు) రూ. 150 నుంచి 300 వరకు సైజును బట్టి అమ్ముతున్నారు. స్థానిక బొబ్బిలి వంతెనపైన.. రహదారుల వెంబడి యువకులు పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారు. సీతాఫలాలను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, ఖమ్మం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో సీతాఫలాల సేకరణ ఉపాధిగా మారింది.