పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి
ABN , First Publish Date - 2021-10-30T04:58:57+05:30 IST
పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
దేవరపల్లి, అక్టోబరు 29: పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఉండవల్లి కృష్ణారావు మాట్లాడుతూ పెట్రో ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల, కోట్లు రాయి తీలు ఇస్తూ సామాన్యులపై భారం వేయడం దుర్మార్గ మన్నారు. పిచ్చుకల సోమసుందరం, పిన్నమనేని సత్యనారాయణ, రత్నాజీ, మడెల్ల రామారావు, ఎస్.భగత్, నీలం రామారావు పాల్గొన్నారు.