బెడ్ల సమాచారానికి కాల్ సెంటర్ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-05-09T06:27:43+05:30 IST
కొవిడ్ బాధితులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందిం చేందుకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు సబ్ కలెక్టర్ విశ్వనాథన్ చెప్పారు.ఆయన చాంబర్లో శనివారం విలేకరులతో మాట్లాడారు.
నరసాపురం/ఉండి, మే 8 : కొవిడ్ బాధితులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందిం చేందుకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు సబ్ కలెక్టర్ విశ్వనాథన్ చెప్పారు.ఆయన చాంబర్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆక్సిజన్, కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత, 108 అంబులెన్స్ సమాచా రాలను 08814– 276699 నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు ఉండికి చెందిన ఇద్దరు వీఆర్వోలను నియమించినట్టు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 2 వరకు వీఆర్వో ఆశీర్వాదం, కంపూట్యర్ ఆపరేటర్ డేవిడ్, మధ్యా హ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ నర్సింహామూర్తి, సిహెచ్ నారాయణమూర్తి, రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల సబ్కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, వీఆర్వో ద్వారకానాథ్లు కాల్ సెంటర్లలో అందుబాటులో ఉంటారన్నారు.