ఆక్వా ఉత్పత్తుల కంటెయినర్ దగ్ధం
ABN , First Publish Date - 2021-04-16T06:29:53+05:30 IST
నరసాపురం నుంచి ముంబై బయలు దేరిన ఆక్వా ఉత్పత్తుల కంటెయినర్ హైదరాబాద్ రింగ్రోడ్డులో బుధవారం రాత్రి దగ్ధమైంది.
నరసాపురం, ఏప్రిల్ 15: నరసాపురం నుంచి ముంబై బయలు దేరిన ఆక్వా ఉత్పత్తుల కంటెయినర్ హైదరాబాద్ రింగ్రోడ్డులో బుధవారం రాత్రి దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.32 లక్షల విలువైన అక్వా ఉత్పత్తులతో పాటు మహా రాష్ట్రకు చెందిన డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. పాలకొల్లు మం డలం ఆగర్తిపాలెంకు చెందిన వ్యా పారి రొయ్యల ఎగుమతి కేంద్రం నిర్వహిస్తున్నాడు. నిత్యం ముంబై, కోల్కతా, కేరళ ప్రాంతాలకు అక్వా ఉత్పత్తులు పంపిస్తారు. ప్రమాద సమాచారంతో దిగ్ర్భాంతి చెందిన వ్యాపారి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లాడు. మరోవైపు ఈ ప్రమాదం జిల్లా అక్వా వ్యాపారులను కలవరానికి గురి చేసింది. జిల్లా నలుమూలల నుంచి నిత్యం కోట్లాది రూపాయల ఆక్వా ఉత్పత్తుల కంటెయినర్లు ద్వారా దేశ నలుమూలలకు ఎగుమతి అవుతుంటాయి. కంటెయినర్ దగ్ధం కావడం, ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి.