108 సిబ్బంది మెరుగైన సేవలందించాలి
ABN , First Publish Date - 2021-05-09T04:58:22+05:30 IST
కరోనా కష్టకాలంలో మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని 108 సిబ్బందికి అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి సూచించారు.

అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి
ఏలూరు క్రైం, మే 8: కరోనా కష్టకాలంలో మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని 108 సిబ్బందికి అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి సూచించారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ప్రాంగ ణంలోని 108 అంబులెన్స్లను శనివారం పరిశీలి ంచారు.108 అంబులెన్స్ సేవలపై ఆరా తీశారు. అంబులెన్స్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి.. ఎలా పనిచేస్తాయనే విషయాలను జిల్లా మేనేజర్ గణేష్ను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం లేకు ండా ఆపదలోని వ్యక్తులకు తక్షణ సహాయానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.