ప్రభుత్వపరమయ్యే వరకూ పోరాడుతాం : ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2021-01-21T05:19:05+05:30 IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంతో చరిత్ర కలిగిన మహారాజా కళాశాల ప్రభుత్వపరమయ్యే వరకూ పోరాటం కొన సాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్‌, రామ్మోహన్‌ తెలిపారు.

ప్రభుత్వపరమయ్యే వరకూ పోరాడుతాం : ఎస్‌ఎఫ్‌ఐ
ఎంఆర్‌ కళాశాల ఎదుట మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు

విజయనగరం దాసన్నపేట, జనవరి 20: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంతో చరిత్ర కలిగిన మహారాజా కళాశాల ప్రభుత్వపరమయ్యే వరకూ పోరాటం కొన సాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్‌, రామ్మోహన్‌ తెలిపారు. బుధవారం కళాశాల లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజా సంఘాలకు కళాశాల వద్ద  ప్రత్యేక ధన్యవాదాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాన్సాస్‌ యాజమాన్యం బీజెపీ ప్రవేశ పెట్టబోతున్న నూతన జాతీయ విద్యావిధానాన్ని బూచీగా చూపిస్తూ ఎంఆర్‌ కళాశాలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనికి  వ్యతిరేకంగా పోరా టం చేస్తామని తెలిపారు. నిలిపివేసిన ఎయిడెడ్‌ సెక్షన్‌ ఆడ్మిషన్లు ప్రారంభించాలని విద్యా మండలి ఆదేశిస్తుం దని, ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ చేసుకోవాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పావని, రాము, హర్ష, హరీష్‌, హరి, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-21T05:19:05+05:30 IST