పొటాష్ కోసం పాట్లు
ABN , First Publish Date - 2021-10-07T05:44:51+05:30 IST
పొటాష్ కోసం పాట్లు
![పొటాష్ కోసం పాట్లు](https://media.andhrajyothy.com/appimg/galleries/192110071212577/10072021001324n61.gif)
గజపతినగరం : పొటాష్కు డిమాండ్ పెరగడం తో రైతులు ఇబ్బందిపడుతున్నారు. బుధవారం సత్య సాయి ట్రేడర్స్లో వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో పొటాష్ను విక్రయించారు. మండలానికి 25 టన్నుల పొటాష్ ఎరువు రావడం, రైతులకు సకాలంలో అందించలేకపోవడంతో ఎరువుల షాపుల వద్ద గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న ఏవో ధనలక్ష్మి అక్కడికి చేరుకుని పొటాష్ను దగ్గరుండి అమ్మకాలు చేపట్టారు.