మధ్యాహ్నం వరకే రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2021-05-06T04:38:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం ఒక పక్క కర్ఫ్యూను అమలు చేస్తూనే అదే సమయంలో ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆత్యధిక ఆదాయాన్ని సమకూర్చే వాటిలో ఒకటైన రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ధ్యేయంతో ఉంది.

మధ్యాహ్నం వరకే రిజిస్ర్టేషన్లు

కొత్తవలస,  మే నెల 5 : రాష్ట్ర  ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం ఒక పక్క కర్ఫ్యూను అమలు చేస్తూనే అదే సమయంలో  ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆత్యధిక ఆదాయాన్ని సమకూర్చే వాటిలో ఒకటైన రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ధ్యేయంతో ఉంది. ఈమేరకు రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పని వేళల్లో మార్పులు తీసుకొచ్చింది. వీటిని తక్షణమే అమలు చేయాలని రిజిస్ర్టేషన్ల శాఖకు చెందిన డీఐజీ, జిల్లా రిజిస్ర్టార్‌ల ద్వారా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీసింది. ఈ నెల 18వతేదీ వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉన్నందున సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు రిజిస్ర్టేషన్‌ వ్యవహారాలు కొనసాగించాలని సూచించింది. తద్వారా కొంతవరకైనా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని భావిస్తోంది. 


-------------

Updated Date - 2021-05-06T04:38:13+05:30 IST