కృష్ణపట్నం పోర్టు కార్మికుల తొలగింపుపై నిరసన
ABN , First Publish Date - 2021-01-21T05:25:32+05:30 IST
: కృష్ణపట్నం పోర్టులో పనిచేస్తున్న 500 కార్మికులను అన్యాయంగా తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక నవ్యాజూట్మిల్లు ముందు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

బొబ్బిలి, జనవరి 20: కృష్ణపట్నం పోర్టులో పనిచేస్తున్న 500 కార్మికులను అన్యాయంగా తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక నవ్యాజూట్మిల్లు ముందు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాల రాస్తున్న కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాల పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, ఈ విధానాలను విడనాడకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మిక నాయకులు చిరంజీవి, బలస శ్రీను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.