ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి

ABN , First Publish Date - 2021-06-22T05:43:11+05:30 IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని పార్వతీపురం తపాలాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎన్‌వి సత్యనారాయణ రాజు అన్నారు.

ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి

పార్వతీపురం తపాల సూపరింటెండెంట్‌ సత్యనారాయణరాజు

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 21: కరోనా విజృంభిస్తున్న తరుణంలో యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని పార్వతీపురం తపాలాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎన్‌వి సత్యనారాయణ రాజు అన్నారు. సోమవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన తపాలాశాఖ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలాశాఖ వారం రోజుల పాటు యోగాకి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించిందని, కరోనా సమయంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా వర్చువల్‌ యోగా తరగతులను నిర్వహించామన్నారు. అలాగే ఏయూ యోగా కళాశాల ప్రొపెషర్‌ సుధాకర్‌ ద్వారా 70 మంది ఉద్యోగులకు వెబ్‌ తరగతుల్లో శిక్షణ ఇచ్చామన్నారు. పార్వతీపురం డివిజన్‌లో ఉన్న మండలాల ప్రజలు విదేశాలకు వెళ్లేం దుకు పాస్‌పోర్టు కోసం విశాఖపట్నం వెళ్లి నానా ఇబ్బందులు పడేవారని, త్వరలో పార్వతీపురంలోనే పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, బొబ్బిలిలో ఆధార్‌ నమోదు కేంద్రాల ద్వారా విజయవంతంగా సేవలందిస్తున్నా మన్నారు. 13 పోస్టుఫీసుల ద్వారా నగదు రహిత సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. సహాయ తపాలాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఆర్‌.నవీన్‌కుమార్‌, పోస్టుమాస్టర్‌ సుధాకర్‌ పాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T05:43:11+05:30 IST