వేంకటేశునికి పూలంగి సేవ
ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST
బొబ్బిలి కంచర వీధిలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం పూలంగి సేవను కన్నులపండువగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
![వేంకటేశునికి పూలంగి సేవ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122511585129/12262021000046n41.gif)
బొబ్బిలి రూరల్, డిసెంబరు 25: బొబ్బిలి కంచర వీధిలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం పూలంగి సేవను కన్నులపండువగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.