వలంటీర్‌పై అధికారుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-03-03T05:41:31+05:30 IST

వలంటీర్‌పై అధికారుల ఆగ్రహం

వలంటీర్‌పై అధికారుల ఆగ్రహం

మృతి చెందిన వృద్ధురాలికి పింఛన్‌ ఇవ్వడంపై మందలింపు

గుర్ల, మార్చి  2 : మృతి చెందిన తర్వాత కూడా వృద్ధురాలి కుటుంబ సభ్యులకు వలంటీర్‌ త్రినాథ్‌ పింఛన్‌ అందించడంపై అధికారులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం గుర్లలో సోమవారం ఓ వృద్ధురాలు మృతి చెందగా, వలంటీర్‌ త్రినాఽథ్‌ అత్యుత్సాహంతో ఆమె బంధువులకు పింఛన్‌ అందజే యడంపై అటు అధికారులకు, ఇటు అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారిం ది. ఇలాంటి పనులు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు మంచిదికాదని మందలించారు. కాగా వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కల్యాణిని సీఈవో ఆదేశించారు.  


Updated Date - 2021-03-03T05:41:31+05:30 IST