స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-30T04:59:32+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్‌.కోట నియోజకవర్గ జనసేనఆధ్వర్యంలో శుక్రవారం కొత్తవలస నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర
కొత్తవలసలో పాదయాత్ర ప్రారంభించిన జనసేన నేతలు, కార్యకర్తలు

కొత్తవలస: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్‌.కోట నియోజకవర్గ జనసేనఆధ్వర్యంలో శుక్రవారం కొత్తవలస నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు.  ఈ నెల 31న విశాఖపట్నంలోని గాజువాకలో పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. నియోజకవర్గ నాయకులుసత్తిబాబు,  సన్యాసినాయుడు,   రవికుమార్‌,  శ్రీను, శ్రీని వాసరాజు, ఎం.శ్రీను పాల్గొన్నారు.   చీపురు పల్లి:  విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనను విజయ వంతం చేయాలని ఆ పార్టీ ప్రతినిధి డి.రామచంద్రరాజు చీపురుపల్లిలో  కరపత్రాన్ని  విడుదల చేశారు. కార్యక్రమంలో లక్ష్మణనాయుడు, రాము నాయుడు, లక్ష్మణరావు, సంతోష్‌, రామకృష్ణ, రమేష్‌ పాల్గొన్నారు.     

 

Updated Date - 2021-10-30T04:59:32+05:30 IST