పురోహిత మిత్ర పథకాలతో బ్రాహ్మణులకు రుణాలు
ABN , First Publish Date - 2021-06-09T06:04:50+05:30 IST
అరుంధతి, పురోహిత మిత్ర పథకాల ద్వారా అర్హత కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు రుణాలు అందచేస్తున్నట్టు బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ జిల్లా అధికారి శ్రీవాణి తెలిపారు.
బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ జిల్లా అధికారి శ్రీవాణి
చోడవరం, జూన్ 8: అరుంధతి, పురోహిత మిత్ర పథకాల ద్వారా అర్హత కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు రుణాలు అందచేస్తున్నట్టు బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ జిల్లా అధికారి శ్రీవాణి తెలిపారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రాహ్మణులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పథకాల ద్వారా ప్రతీ గ్రూపునకు రూ.1.6 లక్షలు మంజూరు చేస్తామని, వీటిని సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ ఉంటుందని తెలిపారు. మండలంలో రూ.1.6 లక్షల చొప్పున ఐదు గ్రూపులకు రుణం మంజూరైందన్నారు. అర్హత కలిగిన బ్రాహ్మణ కుటుంబీకులు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు వడ్డాది నరసింహమూర్తి పంతులు, మండా ఽశ్రీరామమూర్తి, ఎ.రమేశ్, శ్రీరామమూర్తి పాల్గొన్నారు.