చింతలపాలెంలో సాహితీ గోష్ఠి
ABN , First Publish Date - 2021-02-24T05:45:01+05:30 IST
మండలంలోని చింతలపాలెంలో మంగళవారం భీష్మ ఏకా దశ సందర్భంగా చింతలపాలెం సర్పంచ్ మాకెన సీతారామ పాత్రుడు(నవీన్) ఆధ్వర్యంలో అవధాన విద్యాసరస్వతి బులుసు అపర్ణతో సాహిత్య గోష్ఠి నిర్వ హించారు.
కొత్తవలస: మండలంలోని చింతలపాలెంలో మంగళవారం భీష్మ ఏకా దశ సందర్భంగా చింతలపాలెం సర్పంచ్ మాకెన సీతారామ పాత్రుడు(నవీన్) ఆధ్వర్యంలో అవధాన విద్యాసరస్వతి బులుసు అపర్ణతో సాహిత్య గోష్ఠి నిర్వ హించారు. మహాభారతంలో సంజయరాభారం ఘట్టంపై ఈ సాహిత్య గోష్ఠి నడి చింది. పాండవుల తరఫున కౌరవుల వద్దకు రాయభారం నడపడానికి వెళ్లిన సంజయుడి గురించి సాహిత్యపరంగా వివరించారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి చిన అప్పలనాయుడు, గీతం చైర్మెన్ ఎం.శ్రీ భరత్, మాజీశాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి, ద్రోణంరాజు శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు.