జూట్ కార్మికుల సమస్య కొలిక్కి!
ABN , First Publish Date - 2021-02-25T04:57:48+05:30 IST
పట్టణంలో ఉన్న శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్మిల్లు కార్మికుల సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమయ్యాయి. బుధవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ఆధ్వర్యంలో మిల్లు యాజ మాన్యం, కార్మికుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
బొబ్బిలి (రామభద్రపురం), ఫిబ్రవరి 24: పట్టణంలో ఉన్న శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్మిల్లు కార్మికుల సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమయ్యాయి. బుధవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ఆధ్వర్యంలో మిల్లు యాజ మాన్యం, కార్మికుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. బకాయి ఉన్న సొమ్మును విడతల వారీగా చెల్లించేందుకు యాజ మాన్యం అంగీకరించింది. గురువారం నుంచి చెక్కుల రూపంలో రోజుకు 15 మందికి ఈ బకాయిలు చెల్లించడానికి రెండు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది. సుమారు రూ.5 కోట్ల బకాయిలను 428 మంది కార్మికులకు చెల్లించేందుకు చర్యలు చేపడతామని ఫైనాన్స్ మేనేజర్ ఎ.శ్రీనివాసరావు అంగీకరించారు. మార్చి నెలా ఖరులోగా ఈ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు. సమావేశంలో వైసీపీ నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, రమేష్నాయుడు, గోపాలరావు, రాంసుధీర్, కృష్ణమూర్తి, యూని యన్ నాయకులు కృష్ణారావు, శేషగిరిరావు, రామారావు, నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.