పారిశుధ్య పనుల పరిశీలన
ABN , First Publish Date - 2021-01-21T05:24:53+05:30 IST
మునిసిపాలిటీలో పారిశుధ్య పనులను బుధవారం కమిషనర్ ఎంఎం నాయుడు పరిశీలించారు. సైకిల్పై పలువార్డుల్లో పర్యటించారు. మురుగుకాలువలు చెత్తాచెదారాలతో నిండి ఉండడాన్ని ఆయన గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బొబ్బిలి: మునిసిపాలిటీలో పారిశుధ్య పనులను బుధవారం కమిషనర్ ఎంఎం నాయుడు పరిశీలించారు. సైకిల్పై పలువార్డుల్లో పర్యటించారు. మురుగుకాలువలు చెత్తాచెదారాలతో నిండి ఉండడాన్ని ఆయన గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల నివాసముంటున్న వారికి అవగాహన కల్పించారు కాలువల్లో చెత్తాచెదారాలు వేస్తే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కాలువల్లో పూడికతీత, తడి, పొడి చెత్తల సేకరణ, జియోట్యాగింగ్, రహదారుల పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.