పోలింగ్ కేంద్రాల పరిశీలన
ABN , First Publish Date - 2021-02-27T05:35:05+05:30 IST
మునిసిపల్ ఎన్నికల నిర్వ హణకు సంబంధించి పోలింగ్ స్టేషన్లను శుక్రవారం డీఎస్పీ సుభాస్ పరిశీలించారు.
పార్వతీపురంటౌన్: మునిసిపల్ ఎన్నికల నిర్వ హణకు సంబంధించి పోలింగ్ స్టేషన్లను శుక్రవారం డీఎస్పీ సుభాస్ పరిశీలించారు. సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ కళాధర్తోపాటు మున్సిపల్ అధికారులతో కలసి పట్టణంలోని 30 వార్డుల్లోని పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లపై సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ, ఎస్ఐలను కోరారు.