‘చంద్రబాబుపై అక్రమ కేసులు తగవు’
ABN , First Publish Date - 2021-05-09T05:13:25+05:30 IST
టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం తగదని టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) మే8: టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం తగదని టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కక్ష సాధింపులతోనే ప్రభుత్వ పాలన సాగుతుందని ఆరోపించారు. సీఎం జగన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు, లోకేష్పై అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి రాజకీయలు తగవన్నారు. ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తెలిపారు. ఆక్సిజన్ అందక ఎంతోమంది చనిపోతుంటే కనీస చర్యలు చేపట్టకపోవడం భావ్యం కాదన్నారు. నీచ రాజకీయాలు పక్కన పెట్టి అందరికీ వ్యాక్సిన్ వేసి, ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.