బలహీనవర్గాలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2021-02-06T04:51:51+05:30 IST
ప్రభుత్వంలో బడుగు, బలహీనవర్గాల వారికి రక్షణ లేకుండా పోతోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి వైసీపీ నాయకులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నిక
![బలహీనవర్గాలకు రక్షణ కరువు](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020511203387/02052021232145n33.gif)
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
విజయనగరం రింగురోడ్డు, ఫిబ్రవరి 5: వైసీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీనవర్గాల వారికి రక్షణ లేకుండా పోతోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి వైసీపీ నాయకులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 20 శాతం అభ్యర్థులను నిలబెట్టామని తెలిపారు. కేవలం బలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్టు చెప్పారు. బలవంతపు ఏకగ్రీవాలకు తమ పార్టీ దూరమని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు సుంకరి సతీష్ ఉన్నారు.