ఓటు వేయకుండా చేశారు..
ABN , First Publish Date - 2021-03-09T05:01:14+05:30 IST
పార్వతీపురం పట్టణంలోని 29వ వార్డులో ఇద్దరు అభ్యర్థులు అకస్మాత్తుగా పోటీ నుంచి విరమించుకొని తమను ఓటేయకుండా మోసం చేశారంటూ ఆ వార్డు ప్రజలు కొంతమంది స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ వద్ద సోమవారం ధర్నా చేశారు.
నామినేషన్ ఉపసంహరణపై ఓటర్లు నిరసన
పార్వతీపురం టౌన్, మార్చి 8: పార్వతీపురం పట్టణంలోని 29వ వార్డులో ఇద్దరు అభ్యర్థులు అకస్మాత్తుగా పోటీ నుంచి విరమించుకొని తమను ఓటేయకుండా మోసం చేశారంటూ ఆ వార్డు ప్రజలు కొంతమంది స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఇండిపెండింట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని గుడుపూరు ఈశ్వరరావు, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పండా మురళీలు నామినేషన్ వేశారని, వారు బరిలో ఉండడం వల్ల కొందరు విద్యావంతులను పోటీ చేయకుండా ఆపామని విన్నవించారు. తమకు తెలియకుండా పోటీ నుంచి విరమించుకున్నారని, వార్డు వైసీపీకి ఏకగ్రీవం కావడంతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని వాపోయారు. డబ్బు తీసుకొని పోటీ నుంచి తప్పుకొని తమను మోసం చేశారని, ఇదంతా ప్రణాళిక ప్రకారం చేశారని ఆరోపించారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పట్టణ పోలీసు స్టేషన్తోపాటు మున్సిపల్ సహాయ ఎన్నికల అధికారి కనక మహాలక్ష్మీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.