ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-01-24T05:37:57+05:30 IST
స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంగణంలో ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ఎం.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో బాలల సత్వర చికిత్సా కేంద్ర భవన నిర్మాణానికి పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు శంకుస్థాపన చేశారు.
బెలగాం, జనవరి 23: స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంగణంలో ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ఎం.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో బాలల సత్వర చికిత్సా కేంద్ర భవన నిర్మాణానికి పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు శంకుస్థాపన చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రూ. 106 లక్షల వ్యయంతో నిర్మించబోయే భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జోగారావు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మాత్రమే అందుబాటులో ఉన్న బాలల సత్వర చికిత్స సేవలు ప్రాంతీయ ఆసుపత్రి ద్వారా ఇక్కడి పిల్లలు అందు కోనున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు ఎర్లీ ఇంటర్వెన్సన్ ఆక్యుపేషన్ థెరపీ, పిల్లల ఈసీజీ రూము, ప్లేఏరియా, విజన్ ఎంపెయిర్మెంట్, హీరింగ్ ఎంపెయిర్మెంట్, శాంపిల్స్ కలెక్షన్, దంత చికిత్స విభాగం, తదితర ఆధునిక వైద్య సేవలు అందు బాటులోకి రానున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ పి.ప్రభాకర్, డాక్టర్ వెంకటరావు, ఏపీ ఎన్జీవో నాయకులు జీవీఆర్ఎస్ కిశోర్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.