27 నుంచి జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన
ABN , First Publish Date - 2021-10-22T05:12:43+05:30 IST
జిల్లాలో ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టరేట్: జిల్లాలో ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళంలో కార్యక్రమం ముగించుకున్న తరువాత 26న సాయంత్రం విజయనగరం జడ్పీ అతిథి గృహానికి చేరుకుంటారని పేర్కొన్నారు. 27న ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకూ కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహి స్తారన్నారు. అదే రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకూ బీసీ కులాల సమస్యలు, ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో బహిరంగ విచారణ ఉంటుందని తెలిపారు. 28న ఉదయం 9 నుంచి 10 గంటల వరకూ కలెక్టర్, ఎస్పీలతో పాటు వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులతో కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందని వెల్లడించారు. అనంతరం 11 గంటల నుంచి ఒంటి గంట వరకూ కమిషన్ సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందన్నారు.