బంద్ ప్రశాంతం
ABN , First Publish Date - 2021-03-06T05:45:11+05:30 IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
జిల్లా వ్యాప్తంగా వామపక్ష, ప్రజా సంఘ నేతల ఆందోళన
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వర్తక వాణిజ్య దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ సర్వీసులను మధ్యాహ్నం ఒంటి గంట వరకూ స్వచ్ఛందంగా నిలిపేశారు. కార్మిక, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉదయాన్నే ప్రధాన రహదారులపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం దుర్మార్గమైన ఆలోచన అని దుయ్యబట్టారు. తక్షణమే స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
-(ఆంధ్రజ్యోతి బృందం)