పాఠశాల ఆవరణలో ‘ఆసరా ’
ABN , First Publish Date - 2021-10-19T05:26:39+05:30 IST
పట్టణంలోని గొల్లపల్లి వేణుగోపాల మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆసరా సమవేశం నిర్వహించారు. చెక్కుల పంపిణీ కోసం మెప్మా సిబ్బంది తరగతి గదులకు కొన్ని అడు గుల దూరంలోనే పెద్ద వేదికను ఏర్పాటు చేశారు.
బొబ్బిలి రూరల్: పట్టణంలోని గొల్లపల్లి వేణుగోపాల మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆసరా సమవేశం నిర్వహించారు. చెక్కుల పంపిణీ కోసం మెప్మా సిబ్బంది తరగతి గదులకు కొన్ని అడు గుల దూరంలోనే పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. చెవులు హోరెత్తించే పాటలు, డ్యాన్సులు, ప్రసంగాలతో హడావుడి చేశారు. దీంతో స్కూల్లో పాఠాల బోధన అటకెక్కింది. మునిసిపల్ చైర్మన్ వెంకట మురళీ కృష్ణారావు స్వగ్రామం, పాఠశాల స్థలదాత కూడా కావడంతో సిబ్బంది నోరు మెదపలేకపోయారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ మురళీకృష్ణ, కౌన్సిలర్లు శారద, గోవిందమ్మ, కోఆప్షన్ సభ్యులు సత్యనారాయణ, రియాజ్ఖాన్, మెప్మా అధికారులు సింహాచలం, రాము పాల్గొన్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావును వివరణ కోరగా.. దసరా సెలవులుగా భావించి మెప్మా సిబ్బంది అక్కడ సభను ఏర్పాటు చేశారన్నారు. వారిని మందలించామని చెప్పారు.