దొంగతనం కేసులో ఒకరి అరెస్టు
ABN , First Publish Date - 2021-12-01T05:24:24+05:30 IST
డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 27న జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు.
రూ.లక్షతోపాటు బంగారు ఆభరణాలు స్వాధీనం
విజయనగరం క్రైం/ డెంకాడ: డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 27న జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళ వారం విజయనగరం సబ్ డివిజన్ కార్యాలయంలో వెల్లడించారు. డెంకాడ మండలం అక్కివరం గ్రామానికి చెందిన నడిపిల్లి రాజినాయుడు ఇంట్లో నవంబరు 27న రూ.లక్ష నగదుతోపాటు ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీనిపై డెంకాడ ఎస్ఐ పద్మావతి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజినాయుడు ఇంటి సమీపంలో నిర్మాణ పనులకు వచ్చిన కార్మికులపై అనుమానంతో వారి నుంచి వేలిముద్రలు సేకరించారు. ఈక్రమంలో విశాఖపట్నం అబుల్ఘడ్కు చెందిన సెంట్రీ కార్మికుడు మల్లె సూరిబాబును అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. కాగా సూరిబాబుపై గతంలో విశాఖ త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ... బెయిల్పై వచ్చాడు. సెంట్రీ పనుల కోసం అక్కివరం గ్రామానికి వచ్చి ఈ నేరాని కి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకుని, అతన్ని రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ పద్మావతి, పీసీలు కిరణ్, రామరాజులను డీఎస్పీ అభినందించారు.