విజయసాయిరెడ్డిని కలిసిన జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర
ABN , First Publish Date - 2021-10-14T06:15:01+05:30 IST
జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సుభద్ర, ఆమె భర్త మూర్తి బుధవారం విశాఖలో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
![విజయసాయిరెడ్డిని కలిసిన జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర](https://media.andhrajyothy.com/appimg/galleries/192110141242429/10142021004303n8.jpg)
అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని వెల్లడి
పాడేరు, అక్టోబరు 13: జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సుభద్ర, ఆమె భర్త మూర్తి బుధవారం విశాఖలో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకువస్తానని ఈ సందర్భంగా సుభద్ర అన్నారు.